బ్యాట్ క్రీజులోకి జారే సమయంలో
బ్యాట్ క్రీజులోకి జారే సమయంలో తన శరీరానికి తాకి ఉందని హార్దిక్ పాండ్యా భ్రమించాడు. కానీ, ఆ క్షణంలో బ్యాట్తో అతనికి సంబంధం లేకుండా ఉంది. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోగా.. లాంగాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ గుర్తించి అంపైర్కి ఫిర్యాదు చేశాడు.
|
థర్డ్ అంపైర్ని ఆశ్రయించిన ఫీల్డ్ అంపైర్
దీంతో థర్డ్ అంపైర్ని ఆశ్రయించిన ఫీల్డ్ అంపైర్.. రిప్లైని పరిశీలించిన తర్వాత భారత్ స్కోరు నుంచి ఒక పరుగు కోత విధించాడు. ఆ తర్వాత బంతికి ఫోర్ బాదిన హార్దిక్ పాండ్యా ఆ ఓవర్ చివరి బంతికి పెవిలియన్కు చేరాడు. చివర్లో పాండ్యా వేగంగా ఆడటంతో పాటు ఆస్లే బౌలింగ్లో వరుసగా 6, 6, 6తో మెరిశాడు.
|
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత జట్టులో అంబటి రాయుడు (90: 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), హార్దిక్ పాండ్యా (45: 22 బంతుల్లో 2 ఫోర్లు, 5సిక్సులు) మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, నీషమ్ ఒక వికెట్ తీసుకున్నారు.