|
వెన్నునొప్పితో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యా
గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యాకు గత కొద్ది రోజుల క్రితమే తన శస్త్ర చికిత్స పూర్తైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పాండ్యానే స్వయంగా తన ఇనిస్టాగ్రామ్లో పేర్కొన్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రార్ధిస్తున్నారు.
సర్జరీ నిమిత్తం లండన్కు పంపిన బీసీసీఐ
గతేడాది సెప్టెంబర్లో దుబాయ్లో ఆసియాకప్ ఆడుతుండగా హార్దిక్ వెన్నునొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. నొప్పి భరించలేక వెన్ను నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోవడంతో స్ట్రెచర్పై తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే, వెన్నునొప్పి గాయం మళ్లీ తిరగబెట్టడంతో పాండ్యాను బీసీసీఐ ఇటీవలే సర్జరీ నిమిత్తం లండన్కు పంపింది.
సర్జరీ విజయవంతం
ఆసియా కప్ తర్వాత తొలిసారి గాయపడినప్పుడు ఎవరైతే డాక్టర్ పాండ్యాకు చికిత్స అందించాడో అదే వైద్యుడు మళ్లీ హార్దిక్ పాండ్యాకు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరిస్లో పాల్గొన్న పాండ్యా నేరుగా లండన్కు బయల్దేరి వెళ్లాడు. అక్కడ సర్జరీ విజయవంతంగా పూర్తైన విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నాడు.
వెన్నునొప్పి గాయంతో
సఫారీలతో జరిగిన టీ20 సిరీస్లో పాల్గొన్న హార్దిక్ను వెన్నునొప్పి గాయంతో సతమతమయ్యాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కూడా హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకోలేపోయాడు. కూర్పులో భాగంగా హార్దిక్ టెస్టు సిరీస్కు ఎంపికవ్వని సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2020 ప్రారంభమయ్యే నాటికి జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.