|
శనివారం తొలి వన్డే
మూడు వన్డేల సిరిస్లో భాగంగా సిడ్నీ వేదికగా శనివారం తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ సిరిస్కు ఎంపికైన ధోని మంగళవారం రోహిత్, కేదార్, సిరాజ్లతో కలిసి ఆస్ట్రేలియాకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆసీస్తో మూడు వన్డేల సిరిస్ అనంతరం కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరనుంది.
వరల్డ్ కప్ నాటికి ఫామ్ అందుకోవాలని
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. భారత్తో టెస్టు సిరీస్కి ముందు జరిగిన టీ20 సిరీస్లో విఫలమైన మాక్స్వెల్.. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ నాటికి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాడు.
నిరాశపరుస్తున్న ధోనీ
గతేడాది నుంచి పేలవ ఫామ్తో నిరాశపరుస్తున్న ధోనీ, ఆసీస్తో ఇటీవలే ముగిసిన టీ20 జట్టులోనూ చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆసీస్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకోగా.... అంతకముందు ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్ సమం అయింది.