ఓపెనర్ రోహిత్ శర్మకు వింత అనుభవం
తాజాగా సోమవారం ఇలాంటి అనుభవమే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఎదురైంది. వెస్టిండిస్తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చోటు దక్కకపోవడంతో రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి క్వార్టర్ ఫైనల్స్లో రోహిత్ శర్మ ముంబై తరఫున బరిలోకి దిగాడు. బీహార్ జట్టు నిర్దేశించిన 70 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ముంబై దూకుడుగా ఆడోతుంది.
|
రోహిత్ శర్మకు ముద్దు ఇవ్వబోయిన అభిమాని
రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొని వచ్చి రోహిత్ శర్మకు ముద్దు ఇవ్వబోయాడు. అంతేకాదు రోహిత్ శర్మ పాదాలకు కూడా నమస్కరించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మకు అమాంతం హత్తుకుని హగ్ ఇచ్చాడు. ఈ సమయంలో అభిమాని చేష్టలతో బిత్తరపోయిన రోహిత్ శర్మ ఇదేం పని అడిగాడు. అనంతరం అభిమాని అమితానందంతో మళ్లీ తన స్థానానికి వెళ్లిపోయాడు.
కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని అత్యుత్సాహం
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, హైదరాబాద్ వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. బారికేడ్లను దాటి మరీ ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన అభిమాని వెంటనే కోహ్లీని హత్తుకుని నానా హంగామా చేశాడు.
కోహ్లీకి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నం
అంతేకాదు కోహ్లీకి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. దీంతో కోహ్లీ వారించడంతో సెల్ఫీ మాత్రమే తీసుకున్నాడు. అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్, పృథ్వీషా చేరుకునే సరికి వారితో కూడా సెల్పీ దిగాడు. కోహ్లీ అతడిని దూరం జరుపుతుండగా సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. వెంటనే ఉప్పల్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని కడప జిల్లాకు చెందిన అహ్మద్ఖాన్(20)గా గుర్తించారు. కోహ్లీ మీద అభిమానంతోనే మైదానంలోకి వెళ్లినట్లు పేర్కొన్నాడు. రాజ్కోట్ వేదికగా తొలిటెస్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఓ అభిమాని బారికేడ్లను తొలగించుకుని వచ్చి మరీ కోహ్లీతో సెల్ఫీ దిగాడు.