
తేనెటీగల దాడిలో
అయితే, తేనెటీగల దాడిలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. గ్యాలరీలోని ప్రేక్షకులపై మాత్రమే అవి దాడి చేశాయని తెలిపారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

ఇదో దురృష్టకరమైన ఘటన
ఇదో దురృష్టకరమైన ఘటనని, ప్రేక్షకుల కోసం గ్యాలరీలను శుభ్రం చేయించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ప్రేక్షకులను పశ్చిమ దిశ గ్యాలరీ నుంచి తూర్పుదిశకు మార్చామని అన్నారు. కాగా, ఈ మ్యాచ్లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 73 పరుగులతో నాటౌట్గా నిలవడంతో ఇండియా-ఏ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
4-0 ఆధిక్యంలో ఇండియా-ఏ
దీంతో ఐదు వన్డేల సిరిస్లో ఇండియా-ఏ జట్టు 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ (4/49), దీపక్ చాహర్ (2/38) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ లయన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసి కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో పోప్ (65), ములానే (58 నాటౌట్) రాణించారు.

రిషబ్ పంత్ హాఫ్సెంచరీ
అనంతరం 222 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టులో రిషబ్ పంత్ (73 నాటౌట్), హూడా (47 నాటౌట్), కేఎల్ రాహుల్ (42) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.


Click it and Unblock the Notifications












