|
బీసీసీఐ ట్విట్టర్లో వీడియో
ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా మేసేజ్తో కూడిన ఓ వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. "అర్జున అవార్డుతో నన్ను సత్కరించినందుకు ముందుగా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు అందుకున్న మిగతా విజేతలకు నా అభినందనలు. వారంతా కూడా వారి విభాగాల్లో అద్భుతంగా రాణించారు" అని చెప్పుకొచ్చాడు.
జట్టు కోసం ఎల్లప్పుడు
"భారతదేశం కోసం ఆడినప్పుడల్లా భారత జట్టుతోపాటు నా దేశం యొక్క ఖ్యాతిని మరింత పెంచేందుకు నేనెప్పుడూ విధేయతతో కష్టపడతాను. జట్టు కోసం ఎల్లప్పుడు మ్యాచ్ల్లో విజయం సాధించడంతో పాటు దేశాన్ని గర్వపడేలా చేస్తాను" అని జడేజా అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తొలి టెస్టులో హాఫ్ సెంచరీ
ప్రస్తుతం వెస్టిండిస్తో జరుగుతున్న టెస్టు సిరిస్లో సైతం ఫరవాలేదనిపించాడు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన జడేజా(58) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ముఖ్యంగా రహానేతో కలిసి టీమిండియాకు భారీ స్కోరు సాధించిపెట్టడంతో కీలకపాత్ర పోషించాడు.
టెస్టుల్లో 200 వికెట్లు మైలురాయిని
టెస్టుల్లో 200 వికెట్లు మైలురాయిని అందుకోవడానికి జడేజా ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా ఇప్పటివరకు 42 టెస్టులు, 42 టీ20లు, 156 వన్డేలు ఆడాడు. ఒకప్పుడు అశ్విన్, జడేజాలు తుది జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లుగా కొనసాగినప్పటికీ... చైనామన్ స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ రాకతో చాలినన్ని అవకాశాలు దక్కడం లేదు.