|
ఆస్వాదించిన అభిమానులు
నిజంగా ఈ క్షణాన్ని అభిమానులు తెగ ఆస్వాదించారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి రోహిత్ తన కుమార్తె సమైరాతో మాట్లాడేందుకు తాను కూడా చిన్న పిల్లాడయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ముంబై ఇండియన్స్ తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేస్తూ "రోహిత్ శర్మ స్టాండ్లో ఎవరితో మాట్లాడుతున్నాడో ఊహించడి?" అంటూ కామెంట్ పెట్టింది.
400 సిక్సుల క్లబ్లో
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 400 అంతర్జాతీయ సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. షెల్టర్ కాట్రెల్ వేసిన లెంత్ బాల్ను ముందు కొచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా రోహిత్ భారీ సిక్సుగా మలిచాడు.
తొలి భారత క్రికెటర్గా
ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్లో 400 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. మూడు ఫార్మాట్లు కలిపి 400కు పైగా సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో షాహిద్ అఫ్రిది(పాకిస్థాన్), క్రిస్ గేల్(వెస్టిండిస్)లు మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో 534 సిక్సర్లతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా... అఫ్రిది 476 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు.
దిగ్గజాల సరసన
ఇప్పుడు వీరి సరసన రోహిత్ శర్మ చేరాడు. ఇప్పటివరకు వన్డేల్లో 232 సిక్సులు, టెస్టుల్లో 52, టీ20ల్లో 120 సిక్సులతో రోహిత్ శర్మ ఖాతాలో మొత్తం 404 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు భారత జట్టులో రోహిత్ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 91) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.
67 పరుగుల తేడాతో భారత్ విజయం
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా మూడు టీ20ల సిరిస్ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకముందు హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించగా... తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే చెన్నై వేదికగా ఆదివారం జరగనుంది.