For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4వ వన్డేలో ఊహించని ఘటన: కూల్ డ్రింక్స్ దోచుకున్న అభిమానులు

WATCH: Amid water crisis, angry fans loot cold drinks from vendor during IND vs WI 4th ODI in Mumbai

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య నాలుగో వన్డే ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఓ అనూహ్యా సంఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత స్టేడియంలో నీటి సంక్షోభం ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే... ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత... రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయంలో గ్యాలరీలోని అభిమానులు వాటర్ బాటిల్స్ కోసం ప్రయత్నించారు.

 స్టేడియంలో నీటి సంక్షోభం

స్టేడియంలో నీటి సంక్షోభం

అయితే, తగినన్ని వాటర్ బాటిల్స్ అందుబాటులో లేకపోవడంతో స్టేడియంలో నీటి సంక్షోభం ఏర్పడింది. అదే సమయంలో అటుగా కూల్ డ్రింక్స్ అమ్మే వ్యక్తి వచ్చాడు. దీంతో వాటర్ బాటిల్స్ ఉన్నాయా? అంటూ వెండార్‌ను అభిమానులు ప్రశ్నించారు. ఇందుకు వెండార్ వాటర్ బాటిల్స్ లేవని కేవలం కూల్ డ్రింక్స్ మాత్రమే ఉన్నాయని సమాధానమిచ్చాడు.

కోపంతో ఊగిపోయిన క్రికెట్ అభిమానులు

కోపంతో ఊగిపోయిన క్రికెట్ అభిమానులు

అతడి సమాధానంతో కోపంతో ఊగిపోయిన క్రికెట్ అభిమానులు వెండార్ వద్ద ఉన్న శీతల పానీయాలను దోచుకున్నారు. ఈ సంఘటన బ్రబౌర్న్ స్టేడియంలోని బ్లాక్ నెంబర్ 14లోని 5వ నెంబర్ గేట్ వద్ద చోటు చేసుకుంది. రూ. 20 ఖరీదు ఉన్న వాటర్ బాటిల్‌కు అభిమానులు రూ.40 వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా... తగినన్ని వాటర్ బాటిల్స్ స్టేడియం నిర్వాహకులు అందించలేకపోయారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా

తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెండార్ వద్ద నుంచి కూల్ డ్రింక్స్‌ను క్రికెట్ అభిమానులు దోచుకున్నారు. నిజానికి 20 లీటర్ల వరకు వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, స్టేడియం నిర్వాహకులు ఆదేశాల మేరకు వెండార్ తొలుత కూల్ డ్రింక్స్ అమ్మేందుకు మైదానంలోకి వచ్చాడు.

తిరువనంతపురం వేదికగా నవంబరు 1న ఆఖరి వన్డే

తిరువనంతపురం వేదికగా నవంబరు 1న ఆఖరి వన్డే

ఆ తర్వాత నీటి సంక్షోభంతో గ్యాలరీలో పరిస్థితి అదుపులోతి తీసుకొచ్చేందుకు గాను స్టేడియం నిర్వాహకులు హుటాహుటిన వాటర్ బాటిల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా, ముంబై వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 224 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే తిరువనంతపురం వేదికగా నవంబరు 1న జరగనుంది.

Story first published: Wednesday, October 31, 2018, 16:20 [IST]
Other articles published on Oct 31, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+