జట్టులో మార్పులొద్దు:
బర్మింగ్ హామ్లో న్యూజీలాండ్తో జరగబోయే మ్యాచ్లో పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు చేయకూడదని మాజీ కేప్టెన్ వసీం అక్రమ్ సూచించారు. దక్షిణాఫ్రికాపై ఆడిన జట్టుతోనే కివీస్నూ ఢీ కొట్టాలని అన్నారు. ఏ ఒక్కర్ని తొలగించినా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. 1992లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు రెండుసార్లు న్యూజీలాండ్ను ఓడించిందని, దాన్నే పునరావృతం చేయాలని అన్నారు. 1992 నాటి ప్రపంచకప్ టోర్నమెంట్లో లీగ్ మ్యాచ్లో ఒకసారి, సెమీ ఫైనల్లో మరోసారి కివీస్ టీమ్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా- ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ను ఓడించి ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది. పాకిస్తాన్తో మ్యాచ్ ఎదుర్కొనేంత వరకూ న్యూజీలాండ్ నాటి టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ను కూడా ఓడిపోలేదు.
ఫీల్డింగ్లో లోపాలు ఉన్నాయి..
పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్లో రాణించినప్పటికీ.. ఫీల్డింగ్లో లోపాలు ఉన్నాయని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంటుందని సూచించారు. ప్రత్యేకించి- క్యాచ్లను పట్టే సమయంలో ఆటగాళ్లలో తొట్రుపాటు కనిపిస్తోందని అన్నారు. ఫలితంగా- క్యాచ్లను జారవిడుస్తున్నారని, దీనివల్ల మ్యాచ్ ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్లో పాకిస్తాన్ ఇప్పటిదాకా మొత్తం 14 క్యాచ్లను నేలపాలు చేసిందని గుర్తు చేశారు. ప్రపంచకప్ను గెలవాలనే పట్టుదలతో ఉన్న ఏ జట్టుకైనా క్యాచ్లను జారవిడవడం మంచిది కాదని అన్నారు.
విరాట్ కోహ్లీని అధిగమించే సామర్థ్యం..
పాకిస్తాన్ వన్డౌన్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ స్థాయిలో నాణ్యమైన ఆటగాడని వసీం అక్రమ్ కితాబు ఇచ్చారు. 50 లను సెంచరీలుగా మార్చుకోవడానికి కావాల్సిన సామర్థ్యం అతనిలో ఉన్నాయని చెప్పారు. అలా చేయగలిగితే అత్యుత్తమ బ్యాట్స్మెన్గా పేరు తెచ్చుకుంటాడని అన్నారు. విరాట్ కోహ్లీని అధిగమించే సామర్థ్యం బాబర్ ఉందని అన్నారు. పాకిస్తాన్ జట్టు భారీ స్కోరు చేయాలంటే బాబర్ ఆజమ్ తన వ్యక్తిగత స్కోరును మెరుగు పరచుకోవాల్సి ఉంటుందని అర్ధ సెంచరీ సాధించిన ప్రతీసారీ దాన్ని సెంచరీగా మలచుకోవడానికి అతను ప్రయత్నించాలని సూచించారు.