
కోహ్లీ సిద్దంగా ఉన్నాడు
కెప్టెన్సీని అందుకునేందుకు కోహ్లీ సిద్దంగా ఉన్నాడని, తాను ఇప్పటికే నిరూపించుకున్నాడని ధోనీని తప్పుకోవాల్సిందిగా నచ్చచెప్పాడని జాతీయ మీడియాలో వచ్చిన వార్తల సారాంశం. 2019లో జరగబోయే వన్డే వరల్డ్ కప్కు ధోనికి 39 సంవత్సరాలు వచ్చేస్తాయని, హడావుడిగా కోహ్లీకి కెప్టెన్సీ అప్పచెప్పడం మంచిదని వివరించాడట.

తప్పుకోవాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నాడు
దీంతో ధోని అప్పటికప్పుడు ధోని పరిమిత ఓవర్ల కెప్టన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. దీంతో ధోని కెప్టెన్సీ వీడ్కోలు ప్రకటనపై వివాదం ఏర్పడటంతో భారత సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా ధోనీపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, అతను స్వతహాగానే నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు.

ధోనితో ఈ విషయాన్ని చర్చించిన మాట వాస్తవమే
రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ సందర్భంగా తాను ధోనితో ఈ విషయాన్ని చర్చించిన మాట వాస్తవమేనని ఓ స్పోర్ట్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ పదవి నుంచి తాను వైదొలగాలని భావిస్తున్నానని, తన స్థానంలో మరొకరిని కెప్టెన్గా ఎంపిక చేయాలని కోరినట్టు ప్రసాద్ తెలిపారు.

ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధోని చెప్పాడు
ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధోనీ తనతో చెప్పాడని అన్నారు. ధోనీ నిజాయతీ గల వ్యక్తని, అతని నిర్ణయం తనను సైతం ఆశ్చర్యపరిచిందని తెలిపారు. పరిమిత ఓవర్ల కెప్టెన్గా కోహ్లీని ధోని గైడ్ చేయాల్సిన సమయమిదని ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications