ప్రపంచ కప్ జట్టులో ఆడాలని కల
‘టోర్నీగానీ, సందర్భం గానీ మనపై ఆధిపత్యం చెలాయించేలా ఉండొద్దు. అది ప్రపంచకప్ ఫైనల్ అయినా, ఇంకో మ్యాచ్ అయినా పోటీ జరిగేది బంతికి, బ్యాటుకు మధ్యే. దీనిని అంగీకరించడం అంత సులభం కాదు. ఒక ఆటగాడిగా నేనిలాగే సన్నద్ధమయ్యా. అది ప్రపంచకప్ తొలి మ్యాచ్ అయినా, తుది మ్యాచ్ అయినా పోటీ బౌలర్, బ్యాట్స్మెన్కు మధ్యే జరుగుతుంది. తర్వాత బంతిని ఎలా ఆడాలన్నదే ముఖ్యం. రెండు ప్రపంచకప్ ఫైనల్స్కు ముందు నేనిలాగే ఆలోచించా. ప్రపంచ విజేతగా నిలిచిన జట్టులో ఉండటం నా చిన్ననాటి కల. అలా ఒక్కసారి కాదు రెండు సార్లు అవకాశం లభించడం నా అదృష్టం' అని గంభీర్ అన్నాడు.
మోసపూరితంగా వ్యవహరించారని
ఇటీవల గౌతం గంభీర్ ఓ కొత్త వివాదంలో చిక్కుకుని బయటపడ్డాడు. తాను అంబాసిడర్గా వ్యవహరిస్తోన్న రుద్ర బిల్డ్వెల్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై కస్టమర్లంతా ఎదురుతిరుగుతుండటంతో సాకేత్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసు విచారణలో శిక్ష అనుభవిస్తున్న కంపెనీ డైరక్టర్ ముకేష్ ఖురానా, హెచ్ఆర్ ఇన్ ఫ్రా సిటీ డైరక్టర్ గౌతం మెహతాలు మోసపూరితంగా వ్యవహరించారని, పెట్టుబడిదారుల నుంచి ఇళ్లు కొనిస్తామంటూ డబ్బు తీసుకుని మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సంబంధం లేదంటూ గంభీర్ వాదన
సదరు రుద్ర గ్రూపుకు గౌతం గంభీర్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండటంతో ఆయనకు కూడా చిక్కులు తప్పలేదు. ఈ క్రమంలో ఇందిరాపురం ప్రాజెక్టుకు తనకు ఏం సంబంధం లేదని కేవలం అంబాసిడర్గా మాత్రమే వ్యవహరిస్తున్నానంటూ గంభీర్ వాదన వినిపించాడు. దీంతో గంభీర్ ఛార్జి షీటు దాఖలు నుంచి తప్పించుకున్నాడు. ఈ మాజీ క్రికెటర్ను మినహాయించి మిగిలిన వారిపై ఆరోపణల గుప్పించడంతో కేసు విచారణ జరగాల్సి ఉంది.