విశాఖపట్నం: హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నంలో రద్దయిన వన్డే మ్యాచ్కు సంబంధించి టిక్కెట్ల డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సంఘం (ఏసీఏ) తెలిపింది.
ఈ నెల 22, 23 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏసీసే - వీడీసీఏ స్టేడియంలో అభిమానులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. ఈ సేవా కేంద్రాల్లో కొన్నవాళ్లు ఒరిజినల్ టిక్కెట్ ఇస్తే డబ్బులు చెల్లిస్తామని ఏసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్ వెస్టిండిస్ల మధ్య విశాఖపట్నంలో జరగాల్సిన మూడో వన్డే రద్దైన విషయం తెలిసిందే. హుదూద్ తుఫాన్ కారణంగా అతలాకుతలమైన విశాఖపట్నంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది.