బౌలర్లపై ఉన్న విశ్వాసంతో
బౌలర్లపై ఉన్న విశ్వాసంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ టాస్ అనంతరం వెల్లడించాడు. గత రెండు రోజులుగా ఎండలు బాగా కాస్తున్నాయి. మ్యాచ్ రోజు వర్షం పడే అవకాశాలు తక్కువే. ఒకవేళ బుధవారం వర్షం కురిసినా మ్యాచ్కు ఇబ్బందులు తలెత్తకుండా మైదాన సిబ్బంది అంతా సిద్ధం చేశారు.
|
టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ
టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "మేము తొలుత బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ చాలా బాగుంది. కానీ.. రెండో ఇన్నింగ్స్లో కాస్త నెమ్మదించే అవకాశం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. గువహటి వన్డేలో ఆడిన ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో.. ఈ వన్డేకి కుల్దీప్ యాదవ్ని తీసుకున్నాం" అని కోహ్లీ చెప్పాడు.
|
తుది జట్టులో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు
"దీంతో.. తుది జట్టులో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. ఛేదన సమయంలో ఈ స్పిన్నర్లతో వెస్టిండీస్ బ్యాట్స్మెన్కి మిడిల్ ఓవర్లలో చిక్కులు తప్పవు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్ కూడా బ్యాటింగ్ నిర్ణయానికి మరో కారణం. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించేలా ఉందని, పైగా తమ బౌలింగ్ టార్గెట్ను డిఫెండ్ చేయగలిగేలా ఉంది" అని కోహ్లీ తెలిపాడు.
|
ఒక మార్పుతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు
మరోవైపు వెస్టిండిస్ జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆ జట్టు తరుపున ఒబెద్ మెక్కాయ్ అరంగేట్రం చేస్తున్నాడు. థామస్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో సునాయాసంగా గెలిచిన కోహ్లీ సేన.. ఇప్పుడు అచ్చొచ్చిన వైజాగ్ మైదానంలో జోరు కొనసాగించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.
|
భారత్ తుది జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ