పాకిస్థాన్తో యుద్ధం కావాలా?
"ప్రస్తుతం రెండు అంశాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. పాకిస్థాన్తో యుద్ధం కావాలా? అని ఒకటి.. వద్దా? అని మరొకటి. ఈ రెండింటిలో ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే పాక్తో మ్యాచ్ ఆడాలా? వద్దా? అనేది తేలిపోతుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే దేశ సంక్షేమానికి ఏది మంచిదో అదే చేయాలి" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం
"ఏదేమైనా పాక్తో మ్యాచ్ అంటే ఓ యుద్ధంతో సమానం. ఈ యుద్ధంలో గెలవాలి, ఓడిపోకూడదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటుంది. నా వరకైతే ఈసారి కూడా భారతే మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నా" అని సెహ్వాగ్ అన్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో మ్యాచ్ ఆడలంటూ కొందరు, మ్యాచ్ వద్దంటూ మరికొందరు రెండు వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే.
రాజకీయాల్లో చేరతారా అన్న ప్రశ్నకు
ఇక, రాజకీయాల్లో చేరతారా అన్న ప్రశ్నకు "తనకు ఏ పార్టీ మంచి కాంట్రాక్ట్ ఇస్తే అందులో చేరుతానన్నాడు. నెనెప్పుడూ ఒప్పందాలు కుదుర్చుకొని పనిచేస్తా. రంజీల నుంచి ఐపీఎల్ వరకు అదే చేశా. ఏ పార్టీ నాతో మంచి ఒప్పందం కుదుర్చుకుంటుందో దాంట్లో చేరిపోతా. అయితే ఈ ఒప్పందం విలువ రూ.100 కోట్లకు తక్కువగా ఉండొద్దు" అని సెహ్వాగ్ అన్నాడు.