న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనాపై బుడతడి జాగ్రత్తలు.. సెహ్వాగ్‌ ఫిదా (వీడియో)!!

Virender Sehwag Urges People to Follow this Childs COVID-19 Directives in a Video
Virender Sehwag Shares An Important Message To People Through A Child

ఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)పై దేశంలోని క్రీడా ప్రముఖులు ప్రజలకు, అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఇక కరోనాపై చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దుతివ్వాలని కోరుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కరోనాపై అవగాహన కలిగించేలా ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. అయితే ఇది కరోనా వైరస్‌పై సెహ్వాగ్‌ మాట్లాడిన వీడియో కాదు.. ఒక బుడతడు తన బుజ్జి బుజ్జి మాటలతో ఏం చేయాలో చెప్పాడు.

జులై వరకు బ్యాడ్మింటన్ టోర్నీలు వాయిదా: బీడబ్ల్యూఎఫ్‌జులై వరకు బ్యాడ్మింటన్ టోర్నీలు వాయిదా: బీడబ్ల్యూఎఫ్‌

సెహ్వాగ్‌ ఫిదా:

సెహ్వాగ్‌ ఫిదా:

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్‌.. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పే ఓ చిన్నారి మాటలకు ఫిదా అయ్యాడు. ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. అంతేకాదు.. ఆ చిన్నారి చెప్పే మాటల్ని శ్రద్ధగా ఆలకించాలంటూ సెహ్వాగ్‌ విజ్ఞప్తి చేశాడు. 'ఇది మన అందరికీ ఎంతో ముఖ్యమైనది. ఓ చిన్నారి కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముద్దుగా వివరించాడు. దయచేసి అతడు చెప్పే మాటలు వినండి. ఆ సూచనలు పాటించండి' అని వీడియోకి సెహ్వాగ్‌ రాసుకొచ్చాడు.

చిన్నారి సూచనలు..

చిన్నారి సూచనలు..

వీడియోలో చిన్నారి మాట్లాడుతూ... 'మాస్కులు ధరించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, శానిటైజర్లు వాడాలని, ఇండ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించాడు'. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు ఆదివారం దేశమంతా సంఘీభావం తెలిపిన నేపథ్యంలో సెహ్వాగ్‌ మరో ట్వీట్‌ చేశాడు. ఇలానే మరికొన్ని రోజులు దేశమంతా ఐక్యంగా ఉంటే మహమ్మారిపై విజయం సాధించగలమని ట్వీటాడు.

కరోనాపై అవగాహన:

ప్రజలు ఇండ్లలోనే ఉంటూ, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని ట్విట్టర్ వేదికగా వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రజలకు సూచిస్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు కరోనాపై అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ కామెంటేటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ కొనసాగుతున్నాడు. విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం చెప్పడంలో ఈ డాషింగ్ ఓపెనర్‌ది ప్రత్యేక శైలి. 19 టీ20లు, 251 వన్డేలు, 104 టెస్టుల్లో భారత్ తరఫున సెహ్వాగ్‌ ఆడాడు.

Story first published: Tuesday, April 7, 2020, 8:19 [IST]
Other articles published on Apr 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X