సెహ్వాగ్ ఫిదా:
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్.. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పే ఓ చిన్నారి మాటలకు ఫిదా అయ్యాడు. ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. ఆ చిన్నారి చెప్పే మాటల్ని శ్రద్ధగా ఆలకించాలంటూ సెహ్వాగ్ విజ్ఞప్తి చేశాడు. 'ఇది మన అందరికీ ఎంతో ముఖ్యమైనది. ఓ చిన్నారి కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముద్దుగా వివరించాడు. దయచేసి అతడు చెప్పే మాటలు వినండి. ఆ సూచనలు పాటించండి' అని వీడియోకి సెహ్వాగ్ రాసుకొచ్చాడు.
చిన్నారి సూచనలు..
వీడియోలో చిన్నారి మాట్లాడుతూ... 'మాస్కులు ధరించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, శానిటైజర్లు వాడాలని, ఇండ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించాడు'. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు ఆదివారం దేశమంతా సంఘీభావం తెలిపిన నేపథ్యంలో సెహ్వాగ్ మరో ట్వీట్ చేశాడు. ఇలానే మరికొన్ని రోజులు దేశమంతా ఐక్యంగా ఉంటే మహమ్మారిపై విజయం సాధించగలమని ట్వీటాడు.
|
కరోనాపై అవగాహన:
ప్రజలు ఇండ్లలోనే ఉంటూ, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని ట్విట్టర్ వేదికగా వీరేంద్ర సెహ్వాగ్ ప్రజలకు సూచిస్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు కరోనాపై అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ కామెంటేటర్గా వీరేంద్ర సెహ్వాగ్ కొనసాగుతున్నాడు. విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం చెప్పడంలో ఈ డాషింగ్ ఓపెనర్ది ప్రత్యేక శైలి. 19 టీ20లు, 251 వన్డేలు, 104 టెస్టుల్లో భారత్ తరఫున సెహ్వాగ్ ఆడాడు.