డక్వర్త్ లూయిస్పై భారత క్రికెట్ అభిమానులు మండిపాటు
దీంతో తొలి టీ20లో టీమిండియా ఓటమికి కారణమైన డక్వర్త్ లూయిస్ విధానంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ భారత్ ఓడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. "ప్రత్యర్ధి జట్టు కంటే 11 పరుగులు ఎక్కువగా చేసిన జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
|
సెహ్వాగ్ తనదైన శైలిలో ట్విట్
తొలి టీ20లో టీమిండియా ఓటమిపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ట్విట్టర్లో స్పందించాడు. సెహ్వాగ్ ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. "ఆస్ట్రేలియా కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా స్కోరు మీద జీఎస్టీ(వస్తు సేవల పన్ను) విధించడం వల్లే టీమిండియా ఓడిపోయింది. ఏదేమైనప్పటికీ సిరీస్ ఆరంభ మ్యాచ్ మజా అందించింది" అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
శుక్రవారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో రెండో టీ20
ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాట్స్మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ (76) హాఫ్ సెంచరీతో చేయగా, చివర్లో దినేష్ కార్తీక్ (13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. భారత్ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. రెండో టీ20 శుక్రవారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది.
|
సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు రెండు క్యాచ్లు జారవిడచడంతో ఆసీస్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (4) పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.