హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత డ్యాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్లో ఉంటూ తనదైన శైలితో ట్వీట్లు చేస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటాడు.

ఈసారి టీమిండియా ఆల్ రౌండర్ జడేజాను ఉద్దేశించి సెహ్వాగ్ సరదాగా ఓ ట్వీట్ చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలి వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన జడేజాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుని అందుకున్నాడు.
ఈ అవార్డు కింద జడేజాకు లక్ష రూపాయల పేటీఎం క్యాష్ ప్రైజ్ దక్కింది. 'వాహ్ జడ్డూ భాయ్. 2000 నోట్లకు చిల్లర దొరక్క మేము ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఏకంగా నీ పేటీఎమ్లో లక్ష రూపాయలు జమ చేసేసుకున్నావు. అందులో నుంచి కొంచెం నాకు ట్రాన్స్ ఫర్ చేయి ప్లీజ్', అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.
ఇంగ్లాండ్తో మొహాలి వేదికగా జరిగిన మూడో టెస్టులో 90 పరుగులు సాధించి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్న జడేజా జట్టుని పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతేకాదు మొహాలి టెస్టులో సాధించిన 90 పరుగులే టెస్టు క్రికెట్లో జడేజా సాధించిన అత్యధిక స్కోరు. అంతకుముందు జడేజా అత్యధిక టెస్టు స్కోరు 68గా ఉంది.