
సెహ్వాగ్ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ "ఒకే ఓవర్లో 3-4 సిక్సర్లు కొట్టడం లేదా 45 బంతుల్లో 80-90 పరుగులు చేయడం ఒక కళ. రోహిత్ మాదిరిగా క్రమం తప్పకుండా కోహ్లీ ఈ విధంగా ఆడటం నేను చూడలేదు" అని తెలిపాడు. ఈ సందర్భంగా సచిన్తో గతంలో తనకు ఎదురైన ఒక వృత్తాంతాన్ని సెహ్వాగ్ వెల్లడించాడు.

సచిన్ ఎప్పుడూ ఒకటి చెప్పేవాడు
"సచిన్ జట్టులోని మిగతా సభ్యులకు ఎప్పుడూ చెప్పేవాడు... నేను మైదానంలో పరుగులు చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరని? చాలా మందికి తెలియదు. దేవుడు ఒక్కడే కొన్ని పనులను చేయగలడని అది దేవుడిది మాత్రమే సాధ్యమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, అలా మరెవరూ చేయలేరు కూడా" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

తృటిలో ఐదో సెంచరీని చేజార్చుకున్న రోహిత్
కాగా, రెండో టీ20లో రోహిత్శర్మ(85) తృటిలో ఐదో సెంచరీని చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టి20ల్లో అత్యధిక సిక్సర్లు(17 ఇన్నింగ్స్ల్లో 37 సిక్సులు) బాదిన కెప్టెన్గా ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు ధోనీ (62 ఇన్నింగ్స్ల్లో 34 సిక్సులు) అగ్రస్థానంలో ఉండేవాడు.

ధోని సిక్సుల రికార్డు బద్దలు
ధోని 62 ఇన్నింగ్స్లో ఈ రికార్డుని నెలకొల్పగా.... రోహిత్ శర్మ కేవలం 17 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డును సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో 6 సిక్సులు బాదడం విశేషం. దీంతో ఈ ఏడాది అత్యధిక సిక్సులు(66) బాదిన క్రికెటర్గా నిలిచాడు. 2017లో 65 సిక్సులు కొట్టిన రోహిత్ 2018లో 74 బాదాడు.

టీ20ల్లో నాలుగో సారి
టీ20ల్లో నాలుగో సారి శిఖర్ ధావన్తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గతంలో కోహ్లీతో కలిసి మూడు సార్లు వందకు పైగా భాగస్వామ్యాలు నమోదు చేశాడు. రాజ్కోట్ మ్యాచ్లో వీరిద్దరూ 118 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.


Click it and Unblock the Notifications












