IND vs PAK: ఛాంపియన్ ట్రోఫిలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హై-వోల్జేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు రెండు జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడగా.. భారత జట్టు బంగ్లాదేశ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రకటనలు చేయడంలో బిజీగా ఉండగా.. పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ ఈ కీలక మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ నెట్ ప్రాక్టీస్ లో బాగా చెమటలు పడుతూ కనిపించాడు.
మూడు గంటల ముందే వచ్చిన విరాట్ కోహ్లీ
శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో ఇరు జట్లు పాల్గొన్నాయి. ఆశ్చర్యకరంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వరుణ్ చక్రవర్తితో కలిసి షెడ్యూల్ చేసిన ప్రాక్టీస్ సమయానికి మూడు గంటల ముందుగానే ఐసీసీ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్ లో రాణించేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ లో కోహ్లీ బలహీనత గురించి అందరికీ తెలిసిందే.

పేలవమైన ఫామ్ తో ఇబ్బందిపడుతున్న కోహ్లీ
పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ పై 38 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ తో మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ మూడు గంటల ముందుగానే ఐసీసీ క్రికెట్ అకాడమీకి ప్రాక్టీస్ చేయడానికి వచ్చాడు. కోహ్లీతో పాటు దాదాపు డజను మంది అగ్రశ్రేణి యూఏఈ బౌలర్లు ఉన్నారు. అభిషేక్ నాయర్ కోహ్లీ ప్రాక్టీసింగ్ సెషన్ కోసం వచ్చాడు. కోహ్లీ వన్డే సగటు 57.78 కాగా.. కోహ్లీ మరో 15 పరుగులు సాధిస్తే 14 వేల పరుగుల మార్కును దాటి రికార్డును సృష్టించవచ్చు. పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో గెలిచి సెమీ ఫైనల్ కు సులభంగా చేరుకోవాలని టీమిండియా చూస్తుండగా.. పాకిస్థాన్ జట్టు ఈ రేసులో తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.
Virat Kohli has arrived 3 hours before the Team India scheduled Practice time ahead of the Practice time 🔥 [Vaibhav Bhola] pic.twitter.com/a8ZGKxyyj8
— Johns. (@CricCrazyJohns) February 22, 2025