హైదరాబాద్: ఫిఫా 2018 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ బోణీ చేసిన సంగతి తెలుసు. కెప్టెన్ హ్యారీ కేన్ ముందుండి రెండు గోల్స్ చేయడంతో టునీసియాపై 2-1తో ఇంగ్లాండ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ టీమ్కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. జట్టుతోపాటు కెప్టెన్ హ్యారీ కేన్కు కూడా గుడ్లక్ మెసేజ్ పంపించాడు. మ్యాచ్ మొదలయ్యే ముందే విషెస్ చెబుతూ కోహ్లి ట్వీట్ చేశాడు.
ఈ గుడ్లక్ మెసేజ్ బాగానే పనిచేసింది. కెప్టెన్ కేనే టీమ్కు విజయం సాధించిపెట్టాడు. మ్యాచ్ 11వ నిమిషంలోనే కేన్ తొలి గోల్ చేసి ఇంగ్లాండ్కు లీడ్ ఇచ్చాడు. అయితే 35వ నిమిషంలో టునీసియా ప్లేయర్ ఫెర్జానీ సాస్సి పెనాల్టీని గోల్గా మలచి స్కోరు సమం చేశాడు. అయితే 91వ నిమిషంలో కేన్ మరోసారి పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచి ఇంగ్లండ్కు విజయాన్ని అందించాడు.
Wishing you a successful World Cup campaign @HKane! 💪😊 #WorldCupRussia2018 #HarryCan
— Virat Kohli (@imVkohli) June 18, 2018
దీంతో ఇంగ్లాండ్ జట్టుకు, ముఖ్యంగా కెప్టెన్ కేన్కు కోహ్లి లక్కీ చార్మ్ అని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. నిజానికి కోహ్లి, కేన్ మధ్య గతంలో ట్విటర్ సంభాషణ నడిచింది. 2016 టీ20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కోహ్లిని ప్రశంసిస్తూ కేన్ ట్వీట్ చేయగా.. దానికి థ్యాంక్స్ చెబుతూ కోహ్లి మరో ట్వీట్ చేశాడు.
నాలుగు సార్లు ప్రపంచకప్ మహా సంగ్రామంలో పోటీ పడ్డ టునీసియా ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించగలిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ సారి కూడా ఆ జట్టు గ్రూప్ దశ దాటడం కష్టంగానే కనిపిస్తోంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత తిరిగి ప్రపంచకప్ ఆడుతున్న ఈ జట్టు బెల్జియం, ఇంగ్లాండ్ లాంటి జట్లపై గెలవడం దాదాపు అసాధ్యమే. ఇందులో భాగంగానే ఇప్పటికే ఓ సారి ఓటమికి గురైన టునీసియా.. అర్హత మ్యాచ్ల్లో ఓటమి లేకుండా ఈ మెగా టోర్నీకి చేరింది.