
మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్
మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ 2019 షెడ్యూల్ను సైతం ముందుకు జరిపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమై మే మూడో వారానికి ఐపీఎల్ 2019 ముగియనుంది. ఆ తర్వాత వరల్డ్ కప్లో పాల్గొనేందుకు టీమిండియా ఇంగ్లాండ్కు పయనం కానుంది.

వరల్డ్ కప్ దృష్టా ఐపీఎల్ 2019 నుంచి పేసర్లు తప్పుకుంటే
వరల్డ్ కప్ దృష్టా ఐపీఎల్ 2019 నుంచి పేసర్లు తప్పుకుంటే అందుకు బీసీసీఐ నష్టపరిహారం బీసీసీఐనే చెల్లించాలని సీఓఏతో జరిగిన సమావేశంలో కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. ఇందుకు సీఓఏ అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత జట్టులోని ప్రీమియం ఆటగాళ్లు ఎవరైనా ఐపీఎల్ 2019లో పాల్గొనాలని భావిస్తే కేవలం 8 నుంచి 10 మ్యాచ్లు ఆడేందుకే బీసీసీఐ అనుమతించాలని కోహ్లీ సూచించాడు.

ఆటగాళ్ల కోరికను బట్టి
ఆటగాళ్ల కోరికను బట్టి ఐపీఎల్ లీగ్ మొదట్లో లేదా చివర్లో అనేది వారికే వదిలేయాని కోహ్లీ అన్నాడు. కోహ్లీ నిర్ణయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, దీనిపై భిన్న వాయిస్లు వినిపించడం విశేషం. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన ప్రధాన ఆటగాళ్లు ఐపీఎల్ 2019 సీజన్కు దూరంగా ఉంటారని ఆ దేశ బోర్డులు ఇప్పటికే అనధికారికంగా ఇప్పటికే ప్రకటించాయి.

ఐపీఎల్ 2019 సీజన్కు ఆసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లు దూరం
ఇందులో భాగంగా జట్టులో కీలక పేసర్లు అయిన భువీ, బుమ్రా, పాండ్యాలతో పాటు మరికొంత పేస్ బౌలర్లను రానున్న ఐపీఎల్కు దూరంగా ఉంచాలని కోహ్లీ కోరాడు. అంతక ముందు మాదిరి కాకుండా వచ్చే సీజన్ కోసం ఈ ఏడాది ఐపీఎల్ వేలాన్ని డిసెంబర్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ వేలం కూడా బెంగళూరులో కాకుండా జైపూర్లో జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications













