ధోని దూకుడుగా ఆడి ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా
దీనిని చూసి అసహనానికి గురైన కొందరు అభిమానులు మైదానంలోనే విమర్శలు చేశారు. 86 పరుగుల తేడాతో భారత్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. చివర్లో ధోని దూకుడుగా ఆడి ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ధోనిపై వచ్చిన విమర్శలపై కోహ్లీ స్పందించాడు.
ధోని ఫామ్ గురించి ప్రశ్నించడం దురదృష్టకరం
"ధోని ఫామ్ గురించి, అతని సామర్థ్యం గురించి ప్రశ్నించడం దురదృష్టకరం. ధోని తన సహజశైలికి భిన్నంగా ఆడినప్పుడు మళ్లీ మళ్లీ ఇలాగే జరుగుతుంటుంది. అతడు ఫెయిలైనప్పుడు మాత్రమే ఇలా విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది సమయంలోనే జనాలు తమ అభిప్రాయాలను మార్చుకోవడం దురదృష్టకరం" అని కోహ్లీ తెలిపాడు.
మ్యాచ్కు మంచి ముగింపు ఇస్తే
"మ్యాచ్కు మంచి ముగింపు ఇస్తే అతడిని మించిన ఫినిషర్ మరొకడు లేడు అని అంటారు. అలా జరగనప్పుడు మాత్రం విమర్శిస్తారు. పదే పదే అతని ఫామ్పై విమర్శలు చేయడం సరికాదు. క్రికెట్లో మంచి రోజులు, గడ్డు రోజులు ఉంటాయి. జట్టులో అందరికంటే అనుభవం ఉన్న ఆటగాడు ధోనీ. అందరు ఆటగాళ్లు అన్ని వేళలా విజయవంతం అవ్వరు" అని అన్నాడు.
ధోనీకి రెండో వన్డే అచ్చిరాలేదంతే
"ధోనీ విషయంలోనూ అదే జరిగింది. ధోనీకి రెండో వన్డే అచ్చిరాలేదంతే. భవిష్యత్తులో అతడు రాణిస్తాడన్న నమ్మకం ఉంది. అతనిపైనే కాదు జట్టులోని అందరి ఆటగాళ్లపైనే ఇదే నమ్మకం" అని కోహ్లీ అన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది. రెండు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది.