
మేం తలపడిన ప్రత్యర్థులు ఎవరు?
"చాలా మంది సన్నాహక మ్యాచ్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ మేం తలపడిన ప్రత్యర్థులు ఎవరు.. వారి బౌలింగ్లో నాణ్యత ఎంత.. ఇలాంటి విషయాల గురించి కూడా వారు మాట్లాడాలి. టెస్టు సిరీస్కు ముందు తగిన సన్నద్ధత లేకపోతే అది సరిగా ఉపయోగించుకోలేకపోవడం అవుతుంది. కానీ టెస్టుల ముందు దీటైన ప్రత్యర్థితో ఆడకపోతే అది సమయాన్ని వృథా చేసినట్టే" అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

వ్యక్తిత్వాన్ని గుర్తు పెట్టుకుంటారు
ఇక, మైదానం బయట ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటున్నారు అన్న ప్రశ్నకు గాను "ప్రజలు మనం చేసిన పరుగులను కాదు.. వ్యక్తిత్వాన్ని గుర్తు పెట్టుకుంటారు. ఎవరైనా విండీస్ దిగ్గజం రిచర్డ్స్ గురించి మాట్లాడితే.. అతడి సగటు గురించి ప్రస్తావించరు. అతని వ్యక్తిత్వం గురించే చర్చిస్తారు. అందరిలో అతడే ఎలా స్ఫూర్తి నింపాడో మాట్లాడుకుంటారు. నేనూ అలా ఉండాలంటే నా అడుగులు కూడా సరైన దిశలో పడాలి" అని కోహ్లీ అన్నాడు.

ఓడిన తీరే ఎక్కువ బాధ కలిగిస్తోంది
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఓటమి కంటే ఓడిన తీరే ఎక్కువ బాధ కలిగిస్తోందని కోహ్లీ అన్నాడు. ఈ సిరిస్లో గెలవాల్సిన మ్యాచ్లను చేజార్చుకున్నామని కోహ్లీ చెప్పాడు. "ఇది కఠినమైన సిరీస్ అన్న విషయం మాకు అర్థమైంది. కొన్ని తప్పులు చేశాం. వాటిని ఒప్పుకున్నాం. సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. జట్టులో ప్రతిభకైతే లోటు లేదు. అయితే ప్రతిభ కొంతవరకే పనికొస్తుంది" అని కోహ్లీ అన్నాడు.

మానసికంగా బలంగా ఉండాలి
"విదేశీ పర్యటనల్లో మానసికంగా బలంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుత్లో టెస్టు సిరీస్ల్లో విజయం సాధించాలంటే ఈ బలం మేం సాధించాలి. విజయం సాధించే పరిస్థితులు ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోతే.. చాలా బాధ కలుగుతుంది. అసహనంగా కూడా ఉంటుంది. ఎందుకంటే విజయం సాధించే పరిస్థితులను సృష్టించుకున్నా.. ఆధిపత్యం చెలాయించలేకపోయాం. అందుకే ఓటమి కంటే ఓడిన తీరే బాధిస్తోంది" అని కోహ్లీ అన్నాడు.


Click it and Unblock the Notifications
