ఇంగ్లాడ్తో టెస్ట్ సిరిస్ కి ముందు భారత జట్టుకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కోవిడ్తో సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ నుంచి వైదోలిగాడు . ఇప్పడు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కి సైతం కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయ్యిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కోహ్లీకి పాజిటివ్ అన్న విషయం అటు టీం మేనేజ్ మెంట్ కానీ.. ఇటు కోహ్లీ సైడ్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో కోహ్లీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
దక్షిణాఫ్రికాతో టీ20 సీరిస్ నుంచి విశ్రాంతి లభించడంతో కోహ్లీ మాల్దీవులకు వెకేషన్కి వెళ్లాడు. అక్కడినుంచి తిరిగొచ్చాక అతనికి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని ఓ జాతీయ పత్రికా వెల్లడించింది. గత ఏడాది ఇంగ్లాడ్తో జరిగిన నాలుగు టెస్టుల్లో 32 ఏళ్ల కోహ్లీ 7 ఇన్నింగ్స్ల్లో 31.14 సగటుతో 218 పరుగులు చేశాడు. సిరీస్లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే సిరస్ సమయంలో కోహ్లీ టీంఇండియాకి కెప్టెన్గా ఉన్నాడు. ప్రస్తుతం జట్టులో సభ్యునిగా కొనసాగుతున్నాడు.
జులై 1 నుంచి 5 వరకు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో టీఇండియా ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడనుంది. 2021 లో భారత జట్టు ఇంగ్లాడ్లో పర్యటించింది. ఐదు టెస్టు మ్యాచ్ సిరస్లో భాగంగా 2-1తో ముందంజలో ఉంది. చివరిదైనా ఐదవ టెస్ట్ మ్యాచ్ వాయిదా పడింది. దీంతో రీషెడ్యూల్లో భాగంగా మ్యాచ్ నిర్వహించేందుకు ఇరుజట్ల బోర్డులు అంగీకరించాయి.ఈనేపథ్యంలోనే ఇండియా ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు లండన్ బయల్దేరారు. అయితే ఆటగాళ్లు వరుసగా కోవిడ్ సోకడంతో జట్టులో ఆందోళన నెలకొంది.
ఇంగ్లాడ్ తో టెస్ట్ మ్యాచ్ కూ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. విరాట్ కోహ్లీ ఛటేశ్వర పూజారా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, హనుమా విహరి , జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే ఒక్కొక్కరుగా కోవిడ్ బారిన పడుతుండటంతో టెస్ట్ మ్యాచ్ జరుగుతుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. అంతేకాక జట్టు ఆటగాళ్ల ఏకాగ్రతపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోచ్ ద్రావిడ్ సైతం ఆటగాళ్లు కోవిడ్ విషయంలో కొంచెం అసహనంగా ఉన్నట్లు సమాచారం.