దరాబాద్: ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన శ్రేయోభిలాషులకు ట్విట్టర్ ద్వారా థాంక్స్ చెప్పాడు. ఈ అవార్డుని అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రతి ఏటా బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఇస్తారు.
కొందరికి నాపై అనుమానం, అసహ్యం: బీసీసీఐ వేడుకలో కోహ్లీ
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక బుధవారం (మార్చి 8)న కన్నుల పండుగగా జరిగింది. బెంగుళూరులోని రిట్జ్ హోటల్లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి క్రీడా ప్రముఖలందరూ హాజరయ్యారు. వీరితో పాటు టీమిండియా, అవార్జు విజేతలు ఈ ఫంక్షన్కు హాజరయ్యారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాలీ ఉమ్రిగర్ అవార్డును, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 'దిలీప్ సర్దేశాయ్' అవార్డును అందుకున్నారు. పాలీ ఉమ్రిగర్ అవార్డును మూడుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్గా కోహ్లీ గుర్తింపు పొందాడు. 2015-16 సీజన్లో అద్భుత ప్రదర్శనకు గాను కోహ్లీని ఈ అవార్డు వరించింది.
ఈ సందర్భంగా క్రికెట్లో ఉత్తమ క్రికెటర్గా ఎదగడానికి సహకరించిన వారందరికీ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. 'మూడోసారి పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఉంది. నాపై నమ్ముకం ఉంచిన వారందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్ చేశాడు. 2011-12, 2014-15 సీజన్లలో ఈ అవార్డుని కోహ్లీ అందుకున్నాడు.