
పాకిస్థాన్కు చెందిన జావేద్ మియాందాద్
పాకిస్థాన్కు చెందిన జావేద్ మియాందాద్(9 హాఫ్ సెంచరీల)తో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 1987లో జావేద్ మియాందాద్ ఈ రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు ప్రపంచకప్లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న మూడో భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్(2278), సౌరవ్ గంగూలీ(1006) సరసన నిలుస్తాడు.

36 పరుగులు చేస్తే
ఈ మైలురాయిని అందుకోవడానికి కోహ్లీ 36 పరుగులు చేస్తే సరి. ఇక, ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు సాధించడానికి కోహ్లీ కేవలం 7 పరుగుల దూరంలో ఉన్నాడు. అదే గనుక జరిగితే ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు సాధించిన మూడో బ్యాట్స్మెన్గా కోహ్లీ నిలుస్తాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆరోన్ ఫించ్(1138), ఉస్మాన్ ఖవాజా(1067) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు ఏడో సారి
తద్వారా విరాట్ కోహ్లీ ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు ఏడో సారి సాధించినట్లు అవుతుది. దీంతో ఒక క్యాలెంటర్ ఇయర్లో 1000 పరుగులు సాధించిన మాజీ క్రికెట్ దిగ్గజాలైన సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ల రికార్డుని కోహ్లీ అధిగమిస్తాడు. వీరిద్దరూ ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులను ఆరు సార్లు సాధించారు.

రెండు సార్లు వరుసగా నాలుగు ఏళ్ల పాటు
కాగా, విరాట్ కోహ్లీ తన కెరీర్లో 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019లలో 1000 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్(ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు - 7 సార్లు) రికార్డుని విరాట్ కోహ్లీ సమం చేశాడు. ఈ ఏడాది కోహ్లీ 1000 పరుగుల మైలురాయిని అందుకోవడంతో రెండు సార్లు వరుసగా నాలుగు ఏళ్లు ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.

1997-2000లో వరుసగా నాలుగు సార్లు
1997-2000లో వరుసగా నాలుగు సార్లు సౌరవ్ గంగూలీ 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే, సౌరవ్ గంగూలీ ఒక్కసారి ఈ ఘనత సాధించగా... 14 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. అంతేకాదు 30 ఏళ్ల లోపే కోహ్లీ రెండు సార్లు ఈ ఘనత సాధించాడు. గత ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో వన్డేల్లో ఇంగ్లాండ్పై అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ (1238) పేరిట ఉన్న రికార్డునూ కూడా కోహ్లీ అధిగమించాడు.


Click it and Unblock the Notifications












