Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూయార్క్‌లో అనుష్క శర్మతో కెప్టెన్ కోహ్లీ

హైదరాబాద్: శ్రీలంక పర్యటనకు ముందు కాస్తంత విరామం లభించడంతో టీమిండియా కెప్టెన్ కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇటీవలే వెస్టిండిస్‌లో పర్యటించింది.

ఈ పర్యటనలో భాగంగా వెస్టిండిస్‌తో ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడింది. ఐదు వన్డేల సిరిస్‌ను 3-1తేడాతో కైవసం చేసుకోగా, ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20లో కోహ్లీసేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. విండిస్ పర్యటన ముగిసిన అనంతరం కోహ్లీ నేరుగా అమెరికాకు వెళ్లాడు.

SPOTTED: #ViratKohli and #AnushkaSharma in New York!

A post shared by Cricket Shots (@cricketshots) on

అమెరికాలోని న్యూయార్క్‌ వీధుల్లో తన ప్రేయసి అనుష్క శర్మతో చక్కెర్లు కొడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు అనుష్క సైతం న్యూయార్క్‌లో తాను ఉంటున్న బస చేసిన ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.

The sun sets someplace and rises for a new day at another ... have a great day/night y'all .. #NewYork #Sunset #JetLagged

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


జులై 26 నుంచి కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్‌ను ఆడనుంది. ఈ సిరిస్ జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు సాగనుంది.

ఈ క్రమంలో లంక పర్యటనకు ముందు లభించిన విరామ సమయాన్ని కోహ్లీ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. చివరిసారిగా 2015లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకలో పర్యటించి టెస్టు, వన్డే సిరిస్‌ను కూడా సొంతం చేసుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+