
ఓడిపోతామని కోచ్కు చెప్పా:
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఓదశలో మ్యాచ్పై పట్టు కోల్పోయాం. విలియమ్సన్ (95) బ్యాటింగ్ అద్భుతం. అతడు ఆడుతుంటే.. ఈ మ్యాచ్ ఓడిపోతామని కోచ్తో చెప్పా. కాకపోతే అతనికి నిరాశే ఎదురైంది. కొన్ని బంతుల్ని ఆఫ్సైడ్ వేసి షమీ మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించాడు. ఆఖరి బంతి వేసే ముందు చాలా చర్చించాం. చివరి బంతికి ఎలా బౌలింగ్ చేసినా సింగిల్ తీస్తారని తెలుసు. అందుకే నేరుగా వికెట్లకు విసరమని చెప్పా. షమీ అదే చేశాడు. టేలర్ ఔటయ్యాడు. మ్యాచ్ మలుపు తిరిగింది. షమీ వేసిన చివరి నాలుగు బంతులు అత్యద్భుతం' అని కోహ్లీ అన్నారు.

ఈ క్రెడిట్ షమీదే:
'సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ మరోసారి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. విలియమ్సన్ భారీ షాట్లు ఆడాడు. అయితే ఈ రోజు రోహిత్ మంచి టచ్లో ఉండడం కలిసొచ్చింది. సగం ఓవర్ అయ్యాక రోహిత్ ఒక్క షాట్ బాదితే చాలు బౌలర్ ఒత్తిడిలోకి వెళ్తాడని అనుకున్నా. ఎందుకంటే అతడు బంతిని బలంగా బాదేస్తాడు. చివరి రెండు బంతులకు అదే జరిగింది. అంత ఒత్తిడిలో కూడా రోహిత్ అలా భారీ షాట్లు ఆడడం అద్భుతం. అయితే ఈ విజయం క్రెడిట్ మాత్రం షమీదే' అని కోహ్లీ తెలిపారు.

బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం:
'ప్రపంచంలోని అత్యుత్తమ డెత్ స్పెషలిస్టుల్లో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ను విలియమ్సన్ బాగా ఎదుర్కొన్నాడు. మ్యాచ్, సూపర్ ఓవర్లో కేన్ బాగా ఆడాడు. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. మేం ఈ సిరీస్ను 5-0తో గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్ ఇంకా మరికొందరు ఆడలేదు. వారికో అవకాశం ఇవ్వాలి. ఆటగాళ్లు ఎలా ఆడుతారో చూడాలనుకుంటున్నాం' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.

సూపర్ ఓవర్లో విజయం:
మూడో టీ20లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. రోహిత్ (40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65) హాఫ్ సెంచరీ చేయగా.. కోహ్లీ (27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్తో 38), కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్తో 27) రాణించారు. ఛేదనలో న్యూజిలాండ్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులే చేసింది. విలియమ్సన్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 95) చెలరేగగా.. గప్టిల్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 31) వేగంగా ఆడాడు. సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ 17/0 స్కోరు చేయగా.. భారత్ 20/0తో విజయం అందుకుంది.


Click it and Unblock the Notifications












