|
పిల్లలతో సరదాగా కోహ్లీ
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పలు వేషధారణలలో కనిపిస్తారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత క్రికెటర్లు పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంతమంది పిల్లలతో సరదాగా ముచ్చటించాడు. వ్యక్తిగతంగా వారిన కలిసి వారితో సమయం గడిపాడు. ఫొటోలకు పోజులిచ్చాడు. అభిమానులకు విషెస్ చెబుతూ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు.
|
నీలో చిన్నతనాన్ని వదిలేయకు
విరాట్ ఒక్కడే కాదు శిఖర్ ధావన్, ఆజింక్య రహానె, వీవీఎస్ లక్ష్మణ్, హార్దిక్ పాండ్య, పుజారా తదితరులు చిన్నారులతో సందడి చేసిన ఫొటోలను ఫాలోవర్లతో పంచుకున్నారు. వారందరితో ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకున్న విధానాన్ని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. 'నీలోని చిన్నతనాన్ని వదిలేయకు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.'
|
ముందడుగేసి బాల కార్మికులను నిర్మూలించాలని
లక్ష్మణ్ అయితే ఇంకొకడుగు ముందుకేసి బాల కార్మికులను నిర్మూలించాలని పిలుపునిచ్చాడు. ఇంకా నాతోపాటు ఎవరొస్తారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.