
మోడీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం ప్రధాని మోడీకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్.. మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్లు ఉన్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా
తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం తల్లి హీరాబెన్ వద్ద ప్రధాని మోడీ ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నర్మద జిల్లాలో పూజలు నిర్వహించారు. నమామీ దేవి నర్మద మహోత్సవ్ ఉత్సవాలను గుజరాత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ కూడా నర్మద వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ
తర్వాత బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. అంతకుముందు కెపాడియా పార్క్లో సఫారీ టూర్ కూడా చేశారు మోడీ. మోడీ జన్మదినాన్ని పురష్కరించుకొని సేవా వారంగా బీజేపీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజులు వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.


Click it and Unblock the Notifications
