
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అతను చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. 2010 మార్చి 16న విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ ట్వీట్ చేసేటప్పటికీ 23 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు.ఈ ట్వీట్లో విరాట్ కోహ్లీ "ఎప్పటికైనా టీమిండియా తరపున వీలైనన్నీ ఎక్కువ పరుగులు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నా.. ఏదో ఒకరోజు అది నెరవేరుతుంది" అని పేర్కొన్నాడు.
షిబానీ దండేకర్
అలాగే 2011లో ఫర్హాన్ అక్తర్ను ఇటీవల వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి షిబానీ దండేకర్ ట్వీట్ కు కోహ్లీ సమాధానం ఇచ్చాడు. ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. దండేకర్ ట్వీట్ కు బదులిస్తూ "హలో స్ట్రేంజర్, మీరు బాగున్నారని ఆశిస్తున్నాను" అని సమాధానం ఇచ్చాడు. ఈ ట్వీట్ స్క్రీన్షాట్ను అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
విరాట్ కు చాలా మంది క్రికెటర్లు అభిమానులు విషెస్ చెబుతున్నారు.
కోహ్లీ బర్త్ డే వేడుకలు
కాగా కోహ్లీ బర్త్ డే వేడుకలు టీం సభ్యుల మధ్య నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ పోస్ట్ చేసింది. వీడియోలో విరాట్ కోహ్లీ కేక్ కట్ చేయడం చూడొచ్చు. ఆ తర్వాత మిగాత ఆటగాళ్లు కోహ్లీకి కేక్ తినిపించారు. కాగా ఆదివారం భారత్ జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్ కు వెళ్తుంది.