వికెట్లు తీస్తే చాలు కోహ్లీ సంతోషిస్తాడు
ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో 6 వికెట్లు తీసిన చాహల్ కివీస్తో జరిగిన వన్డేల్లో 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ‘నేను పరుగులు ఎక్కువగా ఇచ్చినా విరాట్ భాయ్ ఇబ్బంది పడడు. పరుగులిచ్చినా మధ్య ఓవర్లలో కీలక వికెట్లు తీస్తే ఫర్వాలేదని విరాట్ భాయ్ నాతో ఎప్పుడూ చెప్తుంటారు. టీ20ల్లోనైతే 4 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చినా రెండు, మూడు వికెట్లు తీస్తే చాలు కోహ్లీ సంతోషిస్తాడు' అని తెలిపాడు.
8 ఓవర్ల మ్యాచ్ కావడంతో అలా చేశా
తిరువనంతపురంలో జరిగిన చివరి టీ20లో తనకు ఎదురైన అనుభవం గురించి చాహల్ వివరించాడు. ‘నేను వేసిన రెండో ఓవర్లో పరుగులు ఇవ్వకుండా నియంత్రించడానికే ప్రయత్నించా. ఒక వేళ వికెట్ల కోసం ప్రయత్నిస్తే గాల్లో బంతిని ఫ్లయిట్ చేయాలి. అదే జరిగితే వికెట్ దక్కొచ్చు లేదంటే సిక్సర్ ఇవ్వాల్సి రావొచ్చు. 8 ఓవర్ల మ్యాచ్ కావడంతో పరుగులు ఇవ్వకుండా చూడటమే ముఖ్యం అనుకున్నా. ఆ దిశగానే ప్రయత్నించా' అని చాహల్ తెలిపాడు.
మహీ భాయ్ పరిస్థితిని చక్కగా విశ్లేషించగలరు
‘మిడిల్ స్టంప్పై దాడి చేసేందుకు మా కోచింగ్ సిబ్బంది ఎప్పుడూ సాయపడుతుంటారు. ఇక మైదానంలో మహీ భాయ్ పరిస్థితిని చక్కగా విశ్లేషించగలరు. ఆ వెంటనే ఏం చేయాలో చెప్తారు. ఆఫ్సైడ్ ఆఫ్ స్టంప్ బంతుల్లో వైవిధ్యం ఉంటుంది కానీ కచ్చితమైన ప్రదేశంలో బంతిని పిచ్ చేయడమే నా బలం. అదే సమయంలో బంతిని మెల్లగా వేసి టర్న్ రాబట్టి బ్యాట్స్మెన్ను గందరగోళంలోకి నెట్టేస్తా' అని చాహల్ అన్నాడు.
మంచును ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు
'నిజానికి మంచు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో బంతిని తిప్పడం చాలా కష్టం. కానీ చాహల్ అలాంటి పరిస్థితుల్లోనూ చక్కగా స్పిన్ చేయగలడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలను అనే నమ్మకం ఉండాలి. మానసికంగా దృఢంగా ఉంటే.. మంచును ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు' అని చాహల్ చెప్పాడు. ప్రస్తుతం చాహల్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణలో ఉన్నాడు.