ముంబై: భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆనందకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆయన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సిడ్నీ చేరుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. తన ప్రియుడి పక్కన ఉండడానికి ఆమె ఆస్ట్రేలియాలోని సిడ్నీకి విమానంలో ఎగిరిపోయినట్లు చెబుతున్నారు.

భారత్ ఈ నెల 26వ తేదీన ఆస్ట్రేలియాతో ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగే సెమీ ఫైనల్ మ్యాచులో తలపడనుంది. కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ అనుష్కను మై లవ్ అంటూ సంబోధించాడు. ఎన్హెచ్10లో ఆమె నటనకు ప్రశంసల జల్లు కురిపించాడు.
దాంతో అనుష్క శర్మ ఉప్పొంగిపోయి ఆ ప్రశంసలకు కృతజ్ఞతలు కూడా చెప్పింది. ట్విట్టర్లో అనుష్క శర్మ నటనను ప్రశంసిస్తూ కోహ్లీ వ్యాఖ్యలు చేశాడు. సెమీ ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై దూకుడు ప్రదర్శించి, గాలిలో తన ప్రేయసికి ముద్దులు విసురుతాడా చూడాలి.