
హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్, వేల్స్ ఆతిథ్యమిస్తోన్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే జట్ల కెప్టన్లు అందరితో ఐసీసీ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
ఈ మీడియా సమావేశం ముగిసిన అనంతరం 10 జట్ల కెప్టెన్లతో ఐసీసీ పోటోషూట్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోని ఐసీసీ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో 10 జట్ల కెప్లెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా పోజులిచ్చారు. ఈ ఫోటోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన స్టిల్ యమ క్రేజీగా ఉంది.
కాగా, టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్ 5న సౌతంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి. వరల్డ్కప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి.