
అశ్విన్కు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి
హెర్నియాతో బాధపడుతోన్న టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. ఇక ఎడమ చేతి భుజానికి శస్త్ర చికిత్స కోసం ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా ఐపీఎల్లో పాల్గొనడం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

మురళీ విజయ్కి ఆపరేషన్ అవసరం
మణికట్టు గాయం కారణంగా బాధపడుతోన్న మరో ఓపెనర్ మురళీ విజయ్కి ఆపరేషన్ అవసరమని బీసీసీఐ పేర్కొంది. దీంతో పాటు ఎడమ చేతి భుజం నొప్పి కూడా విజయ్ని వేధిస్తోండటంతో ఐపీఎల్ నుంచి పూర్తి విరామం తీసుకుని, ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తి ఫిట్నెస్ సాధించేలా సిద్ధం కావాలని సూచించింది.

రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్లకు రెండు వారాల పాటు విశ్రాంతి
ఇక ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్ ఆడిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ ఉమేశ్ యాదవ్కు బీసీసీఐ మెడికల్ టీమ్ రెండు వారాల పాటు విశ్రాంతి కల్పించింది. దీంతో ఈ ఇద్దరూ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని బీసీసీఐ మెడికల్ టీమ్ ప్రకటించింది.

ఐపీఎల్ 10వ సీజన్లో రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్
ఈ ఇద్దరూ ఐపీఎల్ 10వ సీజన్లో పాల్గొంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ ఏడాది హోం సీజన్లో ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన చేశారు. ఆల్ రౌండర్ జడేజా 717.2 ఓవర్లు వేసి 71 వికెట్లు తీశాడు. అదే విధంగా ఉమేశ్ యాదవ్ 12 మ్యాచ్ల్లో 355.5 ఓవర్లు వేసి 30 వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications