హైదరాబాద్: భారత్ పని ఇక అయిపోయిందనుకున్న తరుణంలో జట్టును తానే అన్నీ అయి నడిపించాడు. 225 బంతుల్లో 149 పరుగులు చేసి ఇంగ్లీషు బౌలర్లను ఖంగుమనిపించాడు. భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను దాటేశాడు. అంతేకాదు ఇంగ్లాండ్పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన 13వ భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో కోహ్లీ సెంచరీ సాధించాడు.
కోహ్లీ టెస్టు కెరీర్లో ఇది 22వ శతకం. కెప్టెన్గా అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ(15) మూడో స్థానంలో నిలిచాడు. 113 ఇన్నింగ్స్ల్లోనే కోహ్లీ టెస్టుల్లో 22 శతకాలు సాధించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కంటే వేగవంతంగా కోహ్లీ 22 శతకాలు సాధించాడు. 22 శతకాలు చేసేందుకు సచిన్ 114 ఇన్నింగ్స్లు తీసుకుంటే కోహ్లీ 113 ఇన్నింగ్స్ల్లోనే పూర్తి చేశాడు. అలాగే ఇంగ్లాండ్ జట్టుపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన 13వ భారత ఆటగాడిగానూ కోహ్లీ నిలిచాడు.
తొలి టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లీ వెయ్యి పరుగుల మైలురాయిని అందుకోవడానికి 23 పరుగుల వెనుకంజలో ఉన్నాడు. గురువారం రెండో రోజు మ్యాచ్లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటి వరకు 13 మంది భారత ఆటగాళ్లు మాత్రమే ఇంగ్లాండ్పై వెయ్యి పరుగులు సాధించారు.
ఆ రికార్డులోనూ కోహ్లీ చేరిపోయాడు:
కెప్టెన్లుగా అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (25), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్(19) ఉన్నారు. ఇప్పుడు 15 సెంచరీలతో కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ సాధించిన అంతర్జాతీయ సెంచరీల సంఖ్య 57కు చేరుకుంది. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 287 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.