
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మూడోరోజైన సోమవారం విరాట్ కోహ్లీ తన హావభావాలతో ఆశ్చర్యపరిచాడు. దీనిని బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసి ఒక క్యాప్షన్ పెట్టండి అంటూ అభిమానులను అడిగింది. దీనిపై అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.
"పరుగెత్తండి.. పరుగెత్తండి.. పులి వస్తుంది.. పులి వస్తుంది" అని ఒక అభిమాని ట్వీట్ చేయగా మరొక అభిమాని "రవిశాస్త్రి సీసాతో కోహ్లీ నీరు తాగినట్టున్నాడు" అంటూ కామెంట్ పెట్టాడు. మరొక అభిమాని అయితే "బాంబే వెల్వెట్ చూసిన తర్వాత కోహ్లీ స్పందన" ఇదీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.