
అగ్రస్థానంలో రోహిత్ శర్మ
ఈ టీ20 సిరిస్ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలపైనే ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(88 ఇన్నింగ్స్ల్లో 2422 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, విరాట్ కోహ్లీ 65 ఇన్నింగ్స్ల్లో 2369 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

53 పరుగుల వెనుకంజలో కోహ్లీ
విరాట్ కోహ్లీ కేవలం 53 పరుగుల వెనుకంజలో ఉండటంతో ఈ సిరిస్లో రోహిత్ శర్మను అధిగమిస్తాడో లేదో చూడాలి మరి. న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ గుప్టిల్(2283) పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవగా, పాకిస్థాన్కు చెందిన షోయబ్ మాలిక్(2263) నాలుగో స్థానంలో నిలిచాడు.

నాలుగు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ
టీ20ల్లో రోహిత్ శర్మ ఇప్పటికే నాలుగు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే, విరాట్ కోహ్లీ ఖాతాలో 21 హాఫ్ సెంచరీలు ఉన్నప్పటికీ ఒక్క సెంచరీ కూడా లేదు. టెస్టులు, వన్డేల్లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్లో కూడా సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

2015లో సఫారీలదే టీ20 సిరిస్
2015లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో అటు వన్డే సిరిస్తో పాటు టీ20 సిరిస్ను సైతం సొంతం చేసుకుంది. మూడు టీ20ల సిరిస్ను 2-0తో నెగ్గింది. ఈ నేపథ్యంలో మరోసారి సఫారీ జట్టుకు ఆ అవకాశం ఇవ్వకూడదని కోహ్లీసేన భావిస్తోంది. అయితే, 2008 నుంచి ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 13 టీ20లు జరగ్గా టీమిండియా 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది.


Click it and Unblock the Notifications












