
ధోని స్ధానంలో కెప్టెన్గా కోహ్లీ
పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడంతో వన్డే, టీ20 సిరిస్లకు ధోని స్ధానంలో కెప్టెన్గా కోహ్లీని నియమించిన సంగతి తెలిసిందే. కెప్టెన్గా వైదొలగినప్పటికీ ఆటగాడిగా మాత్రం ధోని కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్కు ధోనీతో పాటు ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ని కూడా జట్టులోకి తీసుకున్నారు.

యువీని మళ్లీ జట్టులోకి తీసుకోవడం శుభపరిణామం
యువరాజ్ను మళ్లీ జట్టులోకి తీసుకోవడం శుభపరిణామని, అతను రాణిస్తాడనే నమ్మకముందని గంగూలీ చెప్పాడు. దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2013 డిసెంబర్లో చివరిసారిగా భారత జట్టు తరఫున యువరాజ్ సింగ్ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు జట్టుకు దూరంగానే ఉన్నాడు.

బరోడా జట్టుపై యువరాజ్ డబుల్ సెంచరీ
భారత జట్టులోకి మళ్లీ వస్తానని, నీలం రంగు జెర్సీ ధరిస్తానని గతంలో యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అతడు అనుకున్నట్లే జట్టులోకి పునరాగమనం చేశాడు. 2016 17 రంజీ సీజన్లో యువరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. బరోడా జట్టుపై డబుల్ సెంచరీని కూడా సాధించాడు.

యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి
ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని జట్టులోకి తీసుకోవడం జరిగిందని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ జట్టును ప్రకటించే సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా ఒక డబుల్ సెంచరీతో పాటు 180 కూడా స్కోర్ చేసి చక్కని ఫామ్ కనబర్చాడని ఆయన గుర్తు చేశారు.

కోహ్లీ వల్లే యువీకి భారత జట్టులో చోటు
అందుకే యూవీకి రెండు ఫార్మెట్లలో అవకాశం ఇచ్చామని తెలిపారు. తామంతా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ జట్టుని ఎంపిక చేశారమని, ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నామని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం కోహ్లీ వల్లే యువీకి భారత జట్టు చోటు దక్కిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications