చారిత్రక టెస్టు విజయంలో
ఈ చారిత్రక టెస్టు విజయంలో కెప్టెన్ కోహ్లీ, కోచ్ శాస్త్రి కీలకంగా వ్యవహరించారు. క్రికెట్కు చేసిన సేవలు, సిడ్నీ మైదానంలో చరిత్ర సృష్టించినందుకు వారిని ఇలా సత్కరించామని ఎస్సీజీ చైర్మన్ టోనీ షెఫర్డ్ అన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్ట్ సిరీస్ను దక్కించుకున్న భారత జట్టుకు ఎస్సీజీ తరఫున అభినందనలు" తెలిపారు.
సుదీర్ఘ ఫార్మాట్కు అభిమానుల్లో
"టెస్ట్ క్రికెట్ను కోహ్లీ, శాస్త్రి మరింత ముందుకు తీసుకెళుతున్నారు. సుదీర్ఘ ఫార్మాట్కు అభిమానుల్లో మరింత ఆసక్తి కల్గించేలా పోటీ వాతావరణం నెలకొల్పుతున్నారు. ప్రపంచంలోనే క్రికెట్ను అమితంగా అభిమానించే భారత్ లాంటి దేశం టెస్ట్ క్రికెట్పై దృష్టిపెట్టడం చాలా బాగుంది. టెస్టులకు పునర్ వైభవం కల్పించేందుకు ఇది కీలక అడుగు" అని ఎస్సీజీ చైర్మన్ టోనీ షెఫర్డ్ అన్నారు.
|
ట్విట్టర్లో రవిశాస్త్రి
ఇంతకుముందు ఎస్సీజీ సభ్యత్వం పొందిన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్తో పాటు బ్రియాన్ లారా ఉన్నారు. ఈ సందర్భంగా కోహ్లీతో కలిసి సభ్యత్వం అందుకున్న రవిశాస్త్రి ట్విటర్లో ఈ విషయం వెల్లడించారు. "విరాట్ కోహ్లీతో కలిసి ఎస్సీజీ గౌరవ సభ్యత్వం అందుకోవడం చాలా సంతోషకరం. గౌరవం" అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. శాస్త్రి, కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా 2-1తో టెస్టు సిరీస్ నెగ్గింది.