7 వికెట్ల తేడాతో విజయం
ఇక, బుధవారం మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సిరిస్లో శుభారంభం చేసింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 72 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
కోహ్లీ హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చేసిన పరుగులు 2441. ఈ క్రమంలో అంతముందు వరకు ఈ జాబితాలో రోహిత్ శర్మ (2434) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు.
11వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
రెండో టీ20లో హాఫ్ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కోహ్లీకి ఇది 11వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం. ఈ క్రమంలో కోహ్లీ పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది రికార్డుని సమం చేశాడు. టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో షాహిద్ అఫ్రిది(11) అవార్డులను కోహ్లీ సమం చేశాడు.
టీ20ల్లో 22వది
అయితే, ఆప్ఘన్కు చెందిన మహ్మద్ నబీ(12) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సాధించిన హాఫ్ సెంచరీ అతడికి టీ20ల్లో 22వది కావడం విశేషం. ఈ క్రమంలో రోహిత్ శర్మ(21) హాఫ్ సెంచరీల రికార్డుని సైతం కోహ్లీ అధిగమించాడు. దీంతో పాటు మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజిని కలిగి ఉన్న ఏకైక క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు.