For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుజారా కెప్టెన్సీలో ఆడనున్న విరాట్ కోహ్లీ

By Nageswara Rao

చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛటేశ్వర పుజారా కెప్టెన్సీ ఆడనున్నాడు. ఇండియా ఏ జట్టుకు పూజారా కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. జులై 28-31 వరకు చెన్నైలో జరగనున్న నాలుగు రోజులు రెండో టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు ఆస్టేలియా ఏ జట్టుతో తలపడుతుంది.

ఈ టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే పర్యటనకు పూర్తి విశ్రాంతి తీసుకున్న టీమిండియా టెస్టు విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నాడు. ప్రాక్టీస్ నిమిత్తం ఆస్టేలియా ఏ జట్టుతో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనుమతిని విరాట్ కోహ్లీ కోరాడు.

Virat Kohli to play for India A under Cheteshwar Pujara's captaincy

ఇందుకు సెలక్షన్ కమిటీ ఆమోదం తెలపడంతో నాలుగు రోజుల పాటు జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

మీడియా సమావేశంలో ఈ టెస్టు మ్యాచ్‌కు ఎవరు కెప్టెన్‌గా వ్యవహారిస్తారని సందీపా పాటిల్‌ను అడగ్గా ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఛటేశ్వర పూజారానే జట్టుని ముందుండి నడిపిస్తాడని తెలిపారు. ఈ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడడానికి గల ముఖ్య కారణం చెన్నై చెపాక్ పిచ్ మాదిరే లంకలోని పిచ్‌లు ఉండటమే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+