
స్వాతంత్ర్యం దినోత్సం సందర్భంగా
ఈ చాలెంజ్కు సంబంధించి ఓ వీడియోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘తుమ్ ముజో కౌన్ దో తుమ్హే ఆజాదీ దూంగా' (మీరు మీ రక్తాన్ని ఇవ్వండి.. నేను స్వాతంత్ర్యం తెస్తాను) అనే సుభాష్ చంద్రబోస్ సూక్తిని చెబుతూ.. చిన్నప్పటి నుంచి ఈ సూక్తులు వింటున్నామని, స్వాతంత్ర్యం దినోత్సం సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి భారత సంప్రదాయన్ని చాటుదామని కోహ్లీ పిలుపునిచ్చాడు.
ఇతరులకు ఛాలెంజ్ విసరండి
ఆగస్టు 15రోజున సంప్రదాయంగా సిద్దమై ఆ ఫొటోలను వేష్బుషా యాష్ ట్యాగ్తో అప్లోడ్ చేసి ఇతరులకు ఛాలెంజ్ విసరాలని కోహ్లీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తాను ఓపెనర్ శిఖర్ ధావన్, రిషబ్ పంత్లకు ఈ ఛాలెంజ్ విసురుతున్నట్లు కోహ్లీ ఆ వీడియోల పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో లార్డ్స్ టెస్టుని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండో టెస్టు కోసం టీమిండియా లార్డ్స్కు చేరుకుంది.

లార్డ్స్ పిచ్ను పరిశీలించిన కోచ్ రవిశాస్త్రి
ఇందులో భాగంగా మంగళవారం భారత ఆటగాళ్లు లార్డ్స్ మైదానంలో సాధన చేశారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ పిచ్ను పరిశీలించాడు. పిచ్ గురించి క్యూరేటర్ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది.


Click it and Unblock the Notifications

