ముంబై: భారత క్రికెట్ స్టార్ బ్యాట్సుమెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు మరోసారి కలుసుకున్నారు. వారిద్దరు ముంబై విమానాశ్రయంలో కనిపించారని వార్తలు గుప్పుమంటున్నాయి.

విమానాశ్రయంలో ఉన్న అనుష్కను కలుసుకునేందుకు కోహ్లీ ప్రత్యేకంగా వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, వీరిదద్దరు గుడ్ బై కిస్ ఇచ్చుకున్నారు. ఇరువురు కూడా విడిపోయేటప్పుడు గుడ్ బై చెప్పుకొని ముద్దులు కురిపించుకున్నారు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చాలాకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఇరువురి మధ్య విభేదాలు వచ్చినట్లుగా కనిపించింది. అ తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. ఇప్పుడు ఇరువురు ముద్దులు ఇచ్చుకోవడంపై మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.