
ఆసీస్ గడ్డపై రెండు టెస్ట్ సెంచరీలు చేసిన పుజారా
అడిలైడ్, మెల్బోర్న్ టెస్టుల్లో సెంచరీలు సాధించిన పుజారా 834 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక, మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 67వ స్థానంతో తన టెస్టు కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

10 పాయింట్లు ఎగబాకి 38వ స్థానంలో నిలిచిన రిషబ్ పంత్
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏకంగా 10 పాయింట్లు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడ 880 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. రెండో స్థానంలో జేమ్స్ ఆండర్సన్(874 పాయింట్లు), కమ్మిన్స్(836) పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

12 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్కి చేరుకున్న బుమ్రా
ఇక, మెల్బోర్న్ టెస్టులో 9 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 12 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్కి చేరుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్లో టాప్-10లో రవీంద్ర జడేజా(796 పాయింట్లు) ఏడో స్థానంలో నిలవగా, అశ్విన్(770) పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

116 పాయింట్లతో అగ్రస్థానంలో భారత్
జట్టు ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా గడ్డపై రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా, ఆ తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ (108), న్యూజిలాండ్ (107), దక్షిణాఫ్రికా (106), ఆస్ట్రేలియా (102) టాప్-5లో నిలిచాయి.


Click it and Unblock the Notifications












