
కోట్ల రూపాయలు తీసుకుంటున్న కోహ్లీ
ఇన్స్టాగ్రామ్లో తాను పెట్టే ఒక్కో పోస్టుకు విరాట్ కోహ్లీ ఏకంగా 5.05 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని యూకేకు చెందిన హాపర్ హెచ్ క్యూ సంస్థ ప్రకటించింది. దీంతో భారత సెలబ్రెటీలలో ఇన్స్టాగ్రామ్ పోస్టుకు అత్యధికంగా వసూలు చేస్తున్నది విరాట్ కోహ్లీనే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోహ్లీ 19వ స్థానంలో ఉన్నాడు.
అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ పోస్టుకు అత్యధిక వసూల్ చేస్తున్న టాప్ 20 జాబితాలో భారత్ నుంచి కోహ్లీ మాత్రమే ఉన్నాడు. ఇన్స్ట్రామ్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న భారత సెలబ్రెటీగానూ కోహ్లీ నిలిచాడు. ఇన్స్ట్రామ్లో కోహ్లీకి 177 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాకుండా 150 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ను చేరుకున్న మొదటి భారత సెలబ్రెటీ కోహ్లీనే.

మొదటి స్థానంలో ఫుట్ బాల్ స్టార్
ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ పోస్టుకు అత్యధికంగా వసూల్ చేస్తున్న వారి జాబితాలో స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. రోనాల్డో ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్టుకు 11 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో రోనాల్డోకి ఏకంగా 300 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ జాబితాలో మరో ఫుట్బాల్ స్టార్ మెస్సీ ఏడో స్థానంలో ఉన్నాడు. ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్టుకు మెస్సీ 8.6 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాడు.

నెట్స్లో శ్రమిస్తున్న కోహ్లీ
ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ కేప్టౌన్ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్లను భారత్, సౌతాఫ్రికా చెరోటి గెలుచుకోవడంతో మూడో టెస్టు మ్యాచ్లో సిరీస్ విజేత ఎవరనేది తేలనుంది. గాయం కారణంగా రెండో టెస్టు మ్యాచ్కు దూరమైన కోహ్లీ మూడో టెస్టులో ఆడడం ఖాయమైంది. దీంతో ఆ మ్యాచ్లో ఎలాగైనా రాణించి జట్టును గెలిపించాలని కసిగా ఉన్నాడు. తద్వారా సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలవాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications












