ధోని సలహా మేరకు బుమ్రాకి బౌలింగ్
యుజవేంద్ర చాహల్ బౌలింగ్ కోటా పూర్తి అయిన తర్వాత తాను నెహ్రాను బౌలింగ్కు దింపాలని అనుకున్నానని, అయితే ధోని, కోహ్లీ సలహా మేరకు బుమ్రా చేతికి 19వ ఓవర్ని వేయించానని చెప్పుకొచ్చాడు. చివరి మూడు బంతుల్లో బుమ్రా రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ తొందరగా ముగిసిపోయిందని కోహ్లి అన్నాడు.
ఆశ్రయిస్తున్నా
ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మెట్లో ఈ తరహా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధోనిని ఆశ్రయిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఇక బెంగుళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్పై టీమిండియా 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడు టీ20ల సిరిస్ను 2-1తో భారత్ కైవసం
దీంతో మూడు టీ20ల సిరిస్ను 2-1తో టీమిండియా సొంతం చేసుకుంది. భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్పై టీమిండియాకిది హ్యాట్రిక్ సిరీస్ విజయం. మూడు టీ20లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరిన సంగతి తెలిసిందే.