ముంబై: ఓ మ్యాచ్కు ఎలా సన్నద్ధం కావాలో తనకు తెలుసునని, కానీ పాట పాడేందుకు ఎలా ప్రిపేర్ కావాలో తనకు తెలియదని, నేను మంచి గాయకుడినో కాదో కూడా తనకు తెలియదని, మొత్తానికి పాడగలిగానని, తనకు మాత్రం పాట పాడటం కంటే బ్యాటింగ్ ఈజీ అని విరాట్ కోహ్లీ అన్నాడు.
తాను క్రికెట్కు దూరంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. ఆటకు దూరంగా ఉన్నందుకు కొన్నిసార్లు రిలీఫ్ అనిపిస్తోందని, నిజం చెప్పాలంటే జట్టు కూర్పు, ఇతర విషయాల గురించి నేను అసలు ఆలోచించనని చెప్పాడు. విండస్ పరిస్థితులను గమనించి, అప్పుడు నలుగురు బౌలర్లతోనా లేక ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలా నిర్ణయిస్తామన్నాడు.

కాగా, ఏఆర్ రెహ్మాన్, కోహ్లీలు కలిసి భారత్ వేదికగా వచ్చే నెల 15న మొదలవుతున్న ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ అధికారిక గీతం కోసం పని చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన కోహ్లీ... హమాన్ ట్యూన్లకు అనుగుణంగా ర్యాంప్ సాంగ్ను ఆలపిస్తున్నాడు.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్షికమంలో కోహ్లీ, రెహమాన్ కలిసి కనువిందు చేశారు. 'నామ్ హే ఫుట్సల్' పేరుతో ఈనెల 20న విడుదలయ్యే అవకాశమున్న వీడియో సాంగ్పై కోహ్లీ స్పందించాడు. రెహమాన్తో కలిసి పనిచేసేందుకు ఊవ్విళ్లురుతున్నానని, చిన్నప్పటి నుంచి అతని పాటలు వింటూ పెరిగానని చెప్పాడు.