చిన్నారికి కోహ్లీ చేతుల మీదుగా జెర్సీ
నాలుగో టెస్టు ఐదో రోజు ఆట ముగిసిన అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా ఎనిమిదేళ్ల అనయ జైన్ టీమిండియా జెర్సీని అందుకుంది. ఇంగ్లాండ్పై విజయం సాధించిన టీమిండియా జట్టులో 12వ ఆటగాడిగా అనయను ఎంపిక చేసి జెర్సీని బహుకరించారు.
పార్థివ్ పటేల్ చేతుల మీదుగా
ఈ క్రమంలో నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత భారత ఆటగాడు పార్థివ్ పటేల్ చేతులమీదుగా ఎనిమిది సంవత్సరాల కవలలు వివాన్, విశ్మే టీమిండియా జెర్సీలను అందుకున్నారు.
ఓపెనర్ మురళీ విజయ్ చేతుల మీదుగా
మూడో రోజు ఆట ఆట అనంతరం శతకం నమోదు చేసిన విజయ్ చేతులమీదుగా ఐదేళ్ల చిన్నారి ధృవ టీమిండియా జెర్సీని అందుకుంది.
జయంత్ యాదవ్ చేతుల మీదుగా
నాలుగో రోజు ఆట అనంతరం జయంత్ యాదవ్ చేతుల మీదుగా తొమ్మిదేళ్ల అనయ భన్సాల్ టీమిండియా జెర్సీలను అందుకున్నారు.


Click it and Unblock the Notifications











