
తొలి ఇన్నింగ్స్లో జడేజా అద్భుత ప్రదర్శన
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో జడేజా, పేస్ బౌలర్లతో కలిసి అద్భుతంగా రాణించాడని కోహ్లీ కొనియాడాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా అతడు బాగా రాణించాడని అన్నాడు.

75 పరుగుల తేడాతో గెలవడం ఆశ్చర్యం వేసింది
‘మేము 75 పరుగుల తేడాతో గెలవడం మాకే ఆశ్చర్యం వేసింది. నేను రెండు సార్లు ఒకే విధంగా వికెట్ కోల్పోవడాన్ని గమనించాను. అక్కడ అంపైర్ బాగానే తన బాధ్యతలు నిర్వహించారు' అని కోహ్లీ అన్నాడు.

నేను ఎప్పుడూ హద్దులు మీరలేదు
'స్లెడ్జింగ్, ప్రత్యర్థులతో ఆడటం వేరువేరు. నేను ఎప్పుడూ మైదానంలో హద్దులు మీరలేదు. నాపై ప్రత్యర్థులు దృష్టిపెట్టిన విషయం జట్టులోని సహచర ఆటగాళ్లకు చెప్పాను. అది మా ఆటగాళ్లకు అవకాశంగా మార్చుకోవాలని చెప్పాను.

రహానే, పుజారాలు అద్భుతంగా ఆడారు
ప్రత్యర్థులు నాపై దృష్టిపెట్టినప్పుడు మీరు బాగా ఆడాలని చెప్పాను. దీనిని మా వాళ్లు విజయవంతంగా పూర్తి చేశారు. రహానే, పుజారా బాగా ఆడారు' అని కోహ్లీ వారిద్దరపై ప్రశంసలు కురిపించాడు.


Click it and Unblock the Notifications











